రైల్లో నుంచి జారిపడి మహిళ మృతి | Woman dies in Train accident | Sakshi
Sakshi News home page

రైల్లో నుంచి జారిపడి మహిళ మృతి

Jul 7 2015 7:22 PM | Updated on Apr 3 2019 7:53 PM

నల్లగొండ జిల్లా ఆలేరు - వరంగల్ జిల్లా పెంబర్తి రైల్వే స్టేషన్‌ల మధ్య మంగళవారం ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.

ఆలేరు : నల్లగొండ జిల్లా ఆలేరు - వరంగల్ జిల్లా పెంబర్తి రైల్వే స్టేషన్‌ల మధ్య మంగళవారం ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. 264 / 32-34 డౌన్ ట్రాక్ వద్ద సుమారు 35 సంవత్సరాల వయస్సు గల మహిళ రైలులో నుంచి జారిపడి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే చనిపోయినట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

రెండు రోజుల క్రితం మహిళ మృతి చెందినట్టుగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆలేరులోని ఏరియా ఆసుపత్రికి తరలించామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement