కొత్త పార్టీలపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు | venkaiah naidu takes on congress | Sakshi
Sakshi News home page

కొత్త పార్టీలపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు

Mar 15 2014 4:04 PM | Updated on Mar 29 2019 9:18 PM

కొత్త పార్టీలపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు - Sakshi

కొత్త పార్టీలపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు

కొత్త పార్టీలపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్య నాయుడు స్ఫష్టం చేశారు.

హైదరాబాద్: కొత్త పార్టీలపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్య నాయుడు స్ఫష్టం చేశారు. రెండు రోజుల క్రితం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పెట్టే పార్టీ లోక కల్యాణం చేస్తే మంచిదేనని వ్యాఖ్యానించారు. గతంలో చిరంజీవి పెట్టిన పార్టీ ఏమైందో ప్రజలకు తెలుసని కూడా ఎద్దేవా చేశారు. కొత్త పార్టీలు వచ్చే క్రమంలో ప్రాంతీయ పార్టీలు దేశాన్ని పరిపాలించలేవని, ప్రాంతీయ సమస్యలను పరిష్కరించేందుకే అవి సరిపోతాయన్నవ్యాఖ్యలను వెంకయ్య సమర్ధించుకున్నారు.

 

కొత్త పార్టీలపై తాను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement