ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్ధులకు గాయాలు | two students injured in road accidet at medchal | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్ధులకు గాయాలు

May 15 2017 11:17 AM | Updated on Nov 9 2018 4:44 PM

వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో మరో లారీని ఢీకొట్టింది.

మేడ్చల్‌: వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన మేడ్చల్‌ జిల్లా ఘట్కేసర్‌ మండలంలోని కొండాపూర్‌ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
 
నగరంలోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన లోకేష్‌(22), లక్ష్మణ్‌(22) బైక్‌పై వెళ్తూ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement