
పెళ్లిలో డ్యాన్స్ చేయనీయలేదని..
పెళ్లిలో డ్యాన్స్ చేయనీయనందుకు ఇద్దరు యువకులు మరో ఇద్దరిని కత్తితో పొడిచారు.
హైదరాబాద్సిటీ: పెళ్లిలో డ్యాన్స్ చేయనీయనందుకు ఇద్దరు యువకులు మరో ఇద్దరిని కత్తితో పొడిచారు. ఈ సంఘటన సైదాబాద్లోని మహరాజ్ ఫంక్షన్ హాల్ వద్ద చోటుచేసుకుంది. ఫలక్నూమాలోని సంజయ్ గాంధీ నగర్కు చెందిన షేక్ అన్వర్(20), షేక్ సోబర్(19) అనే ఇద్దరూ నిన్న రాత్రి మహ్మద్ ఖలేద్ అనే స్నేహితుడి పెళ్లికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆ ఇద్దరూ డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కైసర్, అలీ అనే ఇద్దరు అడ్డుకున్నారు. డ్యాన్ చేయవద్దంటూ వారితో వాగ్వాదానికి దిగారు. కోపోద్రిక్తులైన అన్వర్, సోబర్లు వారిపై కత్తితో దాడికి దిగారు. ఈ ఘటనపై పోలీసులు అన్వర్, సోబర్లను అరెస్ట్ చేసి చంచల్గూడా జైలుకు తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.