రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం | Two killed in road accidents | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

Jan 11 2015 1:56 AM | Updated on Aug 30 2018 3:58 PM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆత్మకూర్.ఎస్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.  మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలు జిల్లాలోని ఆత్మకూర్ (ఎస్), కొం డ మల్లేపల్లి మండలాల పరిధిలో శనివారం చోటు చేసు కున్నాయి. వివరాలు.. కుక్కడం గ్రామానికి చెందిన వల్లపు కలింగం(23), పులుగుజ్జు నవీన్ ఇద్దరు కలిసి బైక్‌పై సూర్యాపేటలో బైక్ ఫైనాన్స్ చెల్లించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట నుంచి మహబాద్ సిమెంటు గూనల లోడ్‌తో వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో కలింగం అక్కడికక్కడే మృతిచెందాడు. నవీ న్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని, మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిం చా రు. అనంతరం వైద్యుల సూచనలతో నవీన్‌కు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. లారీడ్రైవర్ పరారీలో ఉన్నా రు. లారీని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అభిలాష్ తెలిపారు.  
 
 డీసీఎం, బైక్ ఢీకొని..
 కొండమల్లేపల్లి : మండలంలోని గొట్టిముక్కల గ్రా మానికి చెందిన గొట్టిముక్కల నాగభూషణం (30) దేవరకొండ పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం దేవరకొండ నుంచి కొండభీమనపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో కల్వకుర్తి నుం చి దేవరకొండ వైపునకు వస్తున్న డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నాగభూషణం అ క్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ము గ్గురు పిల్లలున్నారు. ఈ మేరకు దేవరకొండ ఎస్‌ఐ మోహన్‌రెడ్డి ప్రమాద వివరాలు సేకరిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement