చెరువులో మునిగి ఇద్దరు యువకుల మృతి | Two drowned and died in Pond | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి ఇద్దరు యువకుల మృతి

May 15 2015 3:18 PM | Updated on Sep 17 2018 8:02 PM

ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.

కొండాపూర్ (మెదక్) : ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.  వివరాల్లోకి వెళ్తే... అనంతసాగర్ గ్రామానికి చెందిన రాజు(25), అనిల్(22)లు చెరువు దగ్గరకు వెళ్లగా... అనిల్‌కు ఈత రాకపోయినా నీటిలోకి దిగడంతో ప్రమాదంలో చిక్కుకున్నాడు. అతడిని  కాపాడే ప్రయత్నంలో రాజు కూడా నీటిలోకి దిగి మునిగిపోయాడు.  ఇది గమనించిన స్థానికులు రక్షించేలోపే అనిల్ మృతి చెందగా, రాజును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రాణాలు విడిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement