ఎంపీ పొంగులేటికి రైతుల ఫిర్యాదు
దమ్మపేట: నిబంధనల పేరుతో బ్యాంకర్లు ఇబ్బంది పెడుతూ రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని మండలంలోని పట్వారీగూడేనికి చెందిన పలువురు రైతులు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆదివారం పట్వారీగూడెంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీని రైతులు కలిశారు. పాత పహణీల ప్రకారం రైతులకు కొత్త రుణాలు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ - పహణీలు ఉంటేనే బ్యాంకర్లు రైతులకు కొత్త రుణాలు ఇస్తామంటున్నారని తెలిపారు. పట్వారిగూడెంలో తమకు వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ ఈ పహణీలు లేవని తెలిపారు. తమలాంటి వారికి బ్యాంకర్లు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. అందుకు స్పందించిన ఎంపీ దమ్మపేట తహశీల్దార్కు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీని కలిసిన రైతుల్లో కోటగిరి మురళీ, కూరం చినముత్యాలు, కణితి వెంకటేశ్వరరావు, కోటగిరి సత్తిబాబు, రెడ్డిమళ్ల చిట్టి, కోటగిరి యుగంధర్, పఠాన్ మున్నా తదితరులు ఉన్నారు.
బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారు..
Published Mon, Nov 24 2014 3:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement