'వివిధ పార్టీల నేతలు మాతో టచ్లో ఉన్నారు' | some leaders touch with TRS, says harish rao | Sakshi
Sakshi News home page

'వివిధ పార్టీల నేతలు మాతో టచ్లో ఉన్నారు'

Mar 20 2014 12:59 PM | Updated on Mar 18 2019 9:02 PM

'వివిధ పార్టీల నేతలు మాతో టచ్లో ఉన్నారు' - Sakshi

'వివిధ పార్టీల నేతలు మాతో టచ్లో ఉన్నారు'

వివిధ పార్టీల నేతలు తమతో టచ్లో ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

హైదరాబాద్ : వివిధ పార్టీల నేతలు తమతో టచ్లో ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రెండు, మూడు రోజుల్లో కీలక నేతలు టీఆర్ఎస్లో చేరతారని ఆయన తెలిపారు. పార్టీకి అవసరమైనవారిని మాత్రమే చేర్చుకుంటామని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈనెలాఖరుకు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

సాధారణ ఎన్నికల్లో  పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐతో కలిసి పని చేస్తామని హరీష్ రావు తెలిపారు. సీపీఎంతో పొత్తు అసాధ్యమని ఆయన అన్నారు. తెలంగాణలో తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థి అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement