సర్కార్‌ది ప్రచార ఆర్భాటమే..! : పొన్నం | ponnam prabhakar criticize the trs government | Sakshi
Sakshi News home page

సర్కార్‌ది ప్రచార ఆర్భాటమే..! : పొన్నం

Jun 28 2017 10:26 PM | Updated on Sep 29 2018 4:44 PM

సర్కార్‌ది ప్రచార ఆర్భాటమే..! : పొన్నం - Sakshi

సర్కార్‌ది ప్రచార ఆర్భాటమే..! : పొన్నం

డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమేనని పొన్నం ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు.

కరీంనగర్: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమేనని మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని ఆయన అన్నారు. మూడేళ్ల లో రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి ఆర్టీఐ కింద సేకరించిన వివరాలను వెల్లడించారు. మూడేళ్లలో 2,66,336 ఇళ్లు మంజూరు చేసి, కేవలం 1,708 మాత్రమే నిర్మించారని ఆయన ఆరోపించారు. వాటి కోసం రూ.214 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన రూ.975 కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో ప్రభుత్వం  లేదని, ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement