‘15 కల్లా టీజేఎస్‌ మండల కమిటీలు’ | Kodandaram Focus On Party Committees | Sakshi
Sakshi News home page

‘15 కల్లా టీజేఎస్‌ మండల కమిటీలు’

Jun 7 2018 2:48 AM | Updated on Jul 29 2019 2:51 PM

Kodandaram Focus On Party Committees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నాటికి పార్టీ మండల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. ఈ నెల 3న నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నిర్మాణంతోపాటు వివిధ అంశాలపై చర్చించామన్నారు. ఆ మేరకు మండల కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటివరకు 1,700 మంది అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.  భూ రికార్డుల తప్పులపై అధ్యయనం చేయాలని నిర్ణయించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement