బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్ సతీమణి.
సీఎం కేసీఆర్ సతీమణి శోభ తెలంగాణ భవన్ లో శనివారం జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. శోభ రాకతో.. తెలంగాణ భవన్ లో సందడి వాతావరణం నెలకొంది. బతుకమ్మ వేడుకలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వచ్చారు. వారిలో కలిసి సీఎం సతీమణి బతుకమ్మ ఆడారు. కోలాటాలు ఆడుతూ సందడి చేశారు.
గతంలో టీజీవో భవన్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో శోభ పాల్గొన్న సంగతి తెలిసిందే. అప్పట్లో మహిళా ఉద్యోగులతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు.