పగటిపూట కరెంటు కోసం ధర్నా | Farmers stage dharna infront of power sub station | Sakshi
Sakshi News home page

పగటిపూట కరెంటు కోసం ధర్నా

Oct 15 2015 3:10 PM | Updated on Oct 1 2018 2:09 PM

పగలే కరెంటు ఇవ్వాలని, రాత్రి సరఫరాతో తాము పొలాల్లో ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ధర్నాకు దిగారు.

జైపూర్ (ఆదిలాబాద్) : పగలే కరెంటు ఇవ్వాలని, రాత్రి సరఫరాతో తాము పొలాల్లో ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ధర్నాకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని వేలాల గ్రామానికి చెందిన దాదాపు 50 మంది రైతులు జైపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. రాత్రి కరెంటు వద్దంటూ నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న ఏసీ రాజేందర్‌గౌడ్ వారితో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో రైతులు వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement