ఎండిన పంటను చూసి ఆగిన గుండె | Farmer dies of heart attack | Sakshi
Sakshi News home page

ఎండిన పంటను చూసి ఆగిన గుండె

Sep 24 2015 5:23 PM | Updated on Oct 1 2018 2:44 PM

ఎండిపోయిన పంటను చూసి మనోవేదనకు గురైన రైతు గుండె ఆగింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలం గొల్లపల్లిలో గురువారం జరిగింది.

ఎల్లారెడ్డిపేట (కరీంనగర్) : ఎండిపోయిన పంటను చూసి మనోవేదనకు గురైన రైతు గుండె ఆగింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలం గొల్లపల్లిలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రాల రవీందర్ రెడ్డి(44) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ప్రతి ఏడులాగే ఈ ఏడాది పత్తి పంట సాగు చేశాడు. అయితే సరైన దిగుబడి రాకపోవడంతో ఇప్పటికే అప్పులు అధికమయ్యాయి. ఈ ఏడాది కూడా పంట పూర్తిగా ఎండిపోవడంతో పత్తి చేనులోనే గుండె ఆగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement