మహబూబ్నగర్ వ్యవసాయం: క్షేత్రస్థాయిలో రైతులకు సహాయ, సహకారాలు అందిస్తూ తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడులు సాధించేందుకు కృషిచేయాల్సిన అధికారులు లేక కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఉన్నవారిపై పనిభారం ఎక్కువకావడంతో విధులకు న్యాయం చేయలేకపోతున్నామని చేతులెత్తేస్తున్నారు. మండలాల్లో వ్యవసాయ, విస్తరణ అధికారులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారికి పంటల సాగుపై సూచనలు, సలహాలు ఇచ్చేవారు కరువ య్యారు.
రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ఇదే అదనుగా భావించి కొందరు వ్యాపారులు నకిలీవిత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అంటగడుతున్నారు. అంతేకాకుండా కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు, పంటనష్టం జరిగిన సమయంలో నివేదికలను తయారుచేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పథకాల ద్వారా అందించే యంత్ర పరికరాలు, తైవాన్ స్ప్రేయర్స్, స్ప్రింక్లర్లను పొందేందుకు రైతులు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానాఇబ్బందులు పడుతున్నారు.
ఖాళీలు ఇవే..
జిల్లాలో 119 వ్యవసాయాధికారుల పోస్టులకు 78 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా 152 మండల వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) పోస్టులకు 118మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జిల్లాలో మరో రెండు సహాయ సంచాలకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 64 మండలాలు ఉండగా, 52 మండలాల్లో మాత్రమే వ్యవసాయాధికారులు ఉన్నారు.
దామరగిద్ద, దౌల్తాబాద్, ధన్వాడ, అయిజ, పెద్దమందడి, ఖిల్లాఘనపూర్, తలకొండపల్లి, నాగర్కర్నూల్, బాలానగర్, వెల్దండ, వడ్డేపల్లి, వంగూరు మండలాల్లో పొరుగు మండలాల అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే జిల్లాలోని ఏడీఏ (ఎస్సీ)కార్యాలయాల్లో ఐదు, ఏడీఏ(రెగ్యులర్) కార్యాలయాల్లో ఏడు, బీసీఎల్ కార్యాలయాల్లో మూడు, భూసంరక్షణ పరీక్షల కేంద్రాల్లో ఏడుపోస్టులు ఖాళీగా ఉన్నాయి.
భూసారం.. నిస్సారం.. జిల్లాలో సరిపడా ఏఓలు లేకపోవడంతో భూసార పరీక్షకేంద్రాలు మూతపడ్డాయి. గతంలో నారాయణపేట, గద్వాల మార్కెట్యార్డుల పరిధిలో భూసార పరీక్ష కేంద్రాలు కొనసాగేవి. అక్కడ పనిచేసే ఏఓలు బదిలీపై వెళ్లడంతో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడు ఏఓ పోస్టులు కలిగిన కొల్లాపూర్ స్టాటికల్ సాయిల్డ్ టెస్టింగ్ ల్యాబ్కు మూడేళ్లుగా ఏఓలు లేక తాళం పడింది.
జడ్చర్లలో ఉన్న జిల్లా ప్రయోగశాలలో మరో రెండు ఏఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇక్కడ అనుకున్న స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది 8,500 మట్టినమూనాలకు పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఇప్పటివరకు కేవలం నాలుగువేల మట్టినమూనాలకు మాత్రమే పరీక్షలు నిర్వహించి అధికారులు చేతులు దులుపుకున్నారు. జిల్లాలో వ్యవసాయాధికారులు లేక భూసంరక్షణ పరీక్షల విభాగం నిర్వీర్యమవుతోంది.
సిబ్బంది.. ఇబ్బందే
జిల్లాలో 41 మంది వ్యవసాయాధికారులు, 34 ఏఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 12 మండలాలకు మండల వ్యవసాయాధికారులు లేక పక్క మండల అధికారులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాం.
- భగవత్ స్వరూప్, జేడీఏ
‘సాగు’డెట్లా..?
Published Sun, Jul 6 2014 3:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
చిరు పై పోసాని సంచలన కామెంట్స్
Ragini Dwivedi: వైట్ అవుట్ ఫిట్ తో రాగిణి ద్వివేది అందాలు (ఫొటోలు)
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement