2019లో కాంగ్రెస్దే అధికారం
ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ రాజగోపాల్రెడ్డి అన్నారు. సోమవారం పీఏపల్లి మండలం గుడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నడింబావిగూడెంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ సాధిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారంగా చేసుకున్నాడని విమర్శించారు. అనేక ఉద్యమాలతో గద్దెనెక్కిన కేసీఆర్ నేడు పనిగట్టుకుని ఉద్యమకారులను అవమానపర్చేలా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలపమైన క్యాడర్ ఉందని, నాయకులు అధైర్యపడొద్దని భరోసానిచ్చారు.
నల్లగొండ పార్లమెంట్కు ఉప ఎన్నికలు నిర్వహిస్తే 2లక్షల మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు గడిపల్లిలోని కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ జగన్లాల్నాయక్, గుంజ రేణుకానారాయణ, వడ్త్యా రమేశ్, కొర్ర కిషన్, వడ్లపల్లి చంద్రారెడ్డి, రవికుమార్, దామోదర్రెడ్డి, అర్వపల్లి నర్సింహ, రాజశేఖర్రెడ్డి, వెంకట్రెడ్డి, సైదులు, గోలి వెంకన్న, రాంరెడ్డి, నర్సిరెడ్డి తదితరులున్నారు.