‘విద్యాహక్కు చట్టంపై చొరవ చూపండి’

Congress Leader Jeevan Reddy Writes Letter To KCR Over Education Act - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో విద్యాహక్కు చట్టంపై ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన లేఖలో కోరారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో 25 శాతం పేద, దళిత వర్గాల పిల్లలు చేరేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆంగ్ల మాధ్యమం చేసేలా చూడాలన్నారు. విద్యరంగాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top