నిలిచిపోయిన పెళ్లి: వధువు ఆత్మహత్యాయత్నం
సాక్షి,వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పచ్చల నదుకుడలో వధువు ఆత్మహత్యాయత్నం చేసింది. వరుడు అదనపు కట్నం డిమాండ్ చేయడంతో బుధవారం జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. పెళ్లి ఆగిపోవడంతో మనస్థాపం చెందిన వధువు వాసవి నిద్ర మాత్రలు మింగింది. ప్రస్తుతం ఆమె ఆర్మూర్లోని ఎంజె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.