బెల్గాంలో బీజేపీ సంబరాలు  | BJP Leaders Celebrations In Jainath Adilabad | Sakshi
Sakshi News home page

బెల్గాంలో బీజేపీ సంబరాలు 

Jul 6 2018 1:03 PM | Updated on Mar 29 2019 9:07 PM

BJP Leaders Celebrations In  Jainath Adilabad - Sakshi

బెల్గాంలో బీజేపీ జెండా వద్ద నినాదాలు చేస్తున్న నాయకులు

జైనథ్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధర పెంపుదల చేయడంతో బీజేపీ నాయకులు సంబ రాలు జరుపుకున్నారు. మండలంలోని బెల్గాం గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరించి, టపా సులు కాల్చారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని, తమ సంతోషాన్ని పంచుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు కట్కం రాందాస్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పంటల మద్దతు ధర పెంచడంతో రైతులకు ఎంతో లాభం చేకూరనుందన్నారు.

పత్తికి క్వింటాల్‌కు ఏకంగా రూ.1100లు పెంచడం రైతుల పాలిటవరంగా మారిందన్నారు. రైతు పక్షపాతి అయిన ప్రధాని నరేంద్ర మోడీని 2019లో మరోమారు ప్రధాని చేయాలని ఆయన కోరారు. ఇలాంటి ప్రధాని ఉం టే రానున్న రోజుల్లో రైతులకోసం మరిన్ని పథకా లు వస్తాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పొచ్చిరాం, సురేశ్‌రెడ్డి, పోశాలు, ప్రమోద్, కిషన్, భగవాండ్లు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement