భద్రాచలం నియోజకవర్గంలో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ప్రారంభించారు.
భద్రాచలంలో 100 పడకల హాస్పిటల్
Jul 24 2017 3:52 PM | Updated on Aug 15 2018 8:57 PM
భద్రాచలం: భద్రాచలం నియోజకవర్గంలో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, సున్నం రాజయ్య, కోరం కనకయ్య, కలెక్టర్ రాజీవ్, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో ఆరోగ్యశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గర్భిణీలు ఇంటివద్ద ప్రసవం కాకుండా ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చే రూ.13 వేల నగదు, కేసీఆర్ కిట్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Advertisement
Advertisement