ఏసీబీ దాడిలో పట్టుబడ్డ ఎస్సై | ACB Caught Medchal SI | Sakshi
Sakshi News home page

ఏసీబీ దాడిలో పట్టుబడ్డ ఎస్సై

Jul 30 2015 6:13 PM | Updated on Sep 2 2018 3:43 PM

యాక్సిడెంట్ జరిగి పోలీస్ స్టేషన్ లో ఉన్న కారును తిరిగి ఇచ్చేందుకు లంచం అడిగిన పోలీస్ ఆఫీసర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మేడ్చల్ (రంగారెడ్డి) : యాక్సిడెంట్ జరిగి పోలీస్ స్టేషన్లో ఉన్న కారును తిరిగి ఇచ్చేందుకు లంచం అడిగిన పోలీస్ ఆఫీసర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్‌కు చెందిన అబ్దుల్ రజాక్ కారు జూన్ 4వ తేదీన మేడ్చల్ పరిధిలో యాక్సిడెంట్కు గురైంది.

అప్పటినుంచి ఆ కారు పోలీస్ స్టేషన్లోనే ఉంది. అది తిరిగి ఇవ్వడానికి మేడ్చల్ ఎస్సై రాములు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రజాక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్సై లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement