పది రైళ్లలో శాశ్వతంగా ఏసీ త్రీటైర్‌ కోచ్‌

AC Three Tier Coaches In Ten Trains In South Central Railway zone - Sakshi

సాక్షి, హైదరాబాద్ : పది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో శాశ్వతంగా ఏసీ త్రీ టైర్ కోచ్‌లతో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తిరుపతి-లింగపల్లి రైలు, సికింద్రాబాద్- గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్‌, కాచిగూడ- చిత్తూరు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, కాకినాడ పోర్టు- లింగంపల్లి గౌతమి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- ముంబాయి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో అక్టోబర్‌ 3 నుంచి ఏసీ కోచ్‌లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top