ఆటో బోల్తా: 14 మందికి గాయాలు | 14 injured in an road accident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: 14 మందికి గాయాలు

Mar 26 2015 7:49 AM | Updated on Sep 2 2017 11:26 PM

కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా కొట్టిన ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

నల్లగొండ: కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా కొట్టిన ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం గురువారం ఉదయం నల్లగొండ జిల్లా నడిగూడెం మండలంలో జరిగింది. మండలంలోని పాలారం తండాకు చెందిన 14 మంది కూలీలు ఖమ్మం జిల్లాకు మిర్చీ కోత పనికి ఆటోలో వెళుతుండగా మూల మలపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలోని వారు గాయపడ్డారు. అయితే క్షతగాత్రులతో వెళుతున్న ఆటో కూడా మళ్లీ బోల్తా కొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
(నడిగూడెం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement