పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌; షిర్డీ ట్రస్ట్‌ కీలక ప్రకటన | shirdi sansthan trust rejects 500, 1000 notes | Sakshi
Sakshi News home page

పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌; షిర్డీ ట్రస్ట్‌ కీలక ప్రకటన

Nov 20 2016 3:38 PM | Updated on Sep 4 2017 8:38 PM

పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌; షిర్డీ ట్రస్ట్‌ కీలక ప్రకటన

పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌; షిర్డీ ట్రస్ట్‌ కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో షిర్డీ సాయిబాబా ఆలయ ట్రస్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

ముంబై: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో షిర్డీ సాయిబాబా ఆలయ ట్రస్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లను విరాళంగా తీసుకునేందుకు షిర్డీ సంస్థాన్‌ ట్రస్ట్‌ నిరాకరించింది. పెద్ద నోట్లను విరాళాలుగా తీసుకోబోమని ప్రకటించింది. ఇప్పటి దాకా భక్తులు సమర్పించిన పెద్ద నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేశామని ట్రస్ట్‌ నిర్వాహకులు చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేశాక ప్రజలు కరెన్సీ కష్టాలు పడుతున్న పసంగతి తెలిసిందే. కాగా ఆలయాలకు భక్తులకు సమర్పించే కానుకలపై దీని ప్రభావం పడలేదు. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీకి భారీగా కానుకలు వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement