2019 వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉంటానంటూ తప్పుడు ప్రచారం
నకిరేకల్ /నల్లగొండ లీగల్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 55 సీట్లు వస్తాయని, 26 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రకటించడాన్ని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అసలు ఆయన సర్వే బోగస్ అని మండిపడ్డారు.. నల్లగొండ జిల్లా నకిరేకల్ లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తప్పుడు సర్వేలతో అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించొ ద్దంటూ స్వపక్ష నేతలకు హితవు పలికారు.
గడ్డాలు, మీసాలు పెంచితే అధికారం రాదని ఉత్తమ్కు చురక లంటించారు. టీఆర్ఎస్ ను ఢీకొనాలంటే పోరుబాటే సరైన మార్గమని సూచించారు. నాడు వైఎస్ కార్య కర్తలు, ప్రజలను కలుపుకొని పోరుబాట సాగించి చంద్రబాబు పాలనను మట్టి కరిపించిన విషయాన్ని గుర్తు చేశారు. 2019 వరకు తానే పీసీసీ అధ్యక్షుడిగా ఉంటానంటూ ఉత్తమ్ తప్పుడు ప్రచారం చేయడం తగదని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్లో ఎప్పుడు ఏం జరిగేది ఎవరికీ అర్థం కాదని.. ఆయా సందర్భాల్లోనే అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
అక్రమ కేసులకు భయపడేది లేదు
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయిం చినా భయపడే ప్రసక్తే లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. దౌర్జన్యంగా ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారం భించారన్న అభియోగం మేరకు కోమటిరెడ్డితోపాటు ఆయన అనుచరులు 15 మందిపై 2015 ఆగస్ట్ 8న టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసిన విష యం తెలిసిందే. కేసు వాయిదాకు శుక్రవారం ఎమ్మెల్యే తన అనుచరులతో కలసి నల్లగొండ కోర్టు న్యాయ మూర్తినారాయణరెడ్డి ఎదుట హాజరయ్యారు.
ఉత్తమ్ సర్వే ఉత్తదే: కోమటిరెడ్డి
Published Sat, Feb 18 2017 4:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement