హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్ | husband murder: wife, lover arrested | Sakshi
Sakshi News home page

హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్

Jul 25 2016 10:41 AM | Updated on Aug 20 2018 4:44 PM

తిరుచ్చి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన హత్య కేసులో భార్య, ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.

టీ నగర్(చెన్నై): తిరుచ్చి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన హత్య కేసులో భార్య, ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి సమీపం అనుమానాస్పద స్థితిలో శవంగా లభించిన కేసు మలుపు తిరిగింది. భర్తను హతమార్చిన భార్య, ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. కన్యాకుమారి జిల్లా కరుంగల్ సమీపానగల కల్లువిలైకు చెందిన వ్యక్తి జగన్స్‌బాబు (31).

ఈయన సింగపూరులో కొన్నేళ్ల క్రితం పనిచేస్తూ వచ్చాడు. జగన్స్‌బాబుకు, అదే ప్రాంతానికి చెందిన అజితా (25)కు గత జూన్ నెల ఎనిమిదో తేదీన వివాహం జరిగింది. అజితా చెన్నై కేళంబాక్కంలోగల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తూ వచ్చారు. ఇలావుండగా ఈ నెల ఎనిమిదవ తేదీన జగన్స్‌బాబు తిరుచ్చి రైల్వేస్టేషన్ సమీపం అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. కాగా, ఈ హత్యకు సంబంధించి అజితా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను ప్రియుడితో కలిసి ఈ హత్యను చేసినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement