రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
Mar 4 2017 11:49 AM | Updated on Mar 19 2019 5:52 PM
జైనథ్: రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున కానిస్టేబుల్ శ్రీనివాస్ లక్ష్మీపూర్ మూలమలుపు వద్ద బైక్ బోల్తా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ మృతికి రోడ్డుపై ఉన్న మలుపులే కారణమంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement