పదవులిస్తాం | bjp giving offers to leaders | Sakshi
Sakshi News home page

పదవులిస్తాం

Jan 25 2014 3:11 AM | Updated on Mar 29 2019 9:18 PM

రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే వేర్వేరు కూటమిగా ఏర్పడి లోక్‌సభ ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి.

 ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు పోటీ పడుతున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆయా నేతలను తమవైపు తిప్పుకునేందుకు సరికొత్త వ్యూహం పన్నింది. పొత్తు పార్టీలకు మంత్రి పదవులు ఇస్తామంటూ ఎరవేయడం
 ప్రారంభించింది.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే వేర్వేరు కూటమిగా ఏర్పడి లోక్‌సభ ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. ఈ రెండు పార్టీలకు దీటుగా మూడో కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద సంఖ్యలో లోక్‌సభ స్థానాలను దక్కించుకునేందుకు
 బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను ఆశ్రరుుంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వీలైనన్ని ప్రాంతీయ పార్టీలను అక్కున చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ఫలించారుు. పొత్తుకు ఎండీఎంకే అంగీకారం తెలిపింది. పీఎంకేతో చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ను ఎలాగైనా తమతో చేర్చుకోవాలని కాంగ్రెస్, డీఎంకే ప్రయత్నిస్తున్నాయి. విజయకాంత్, ఆయన భార్య ప్రేమలత తదితరులతో బీజేపీ రహస్య చర్చలు సాగిస్తోంది. యూపీఏ అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్న తరుణంలో బీజేపీదే పైచేయిగా ప్రచారం సాగిస్తోంది. తాము సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చినా పొత్తుకుదుర్చుకున్న పార్టీలకు కేంద్ర మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ హామీ ఇస్తోంది. పొత్తు హామీల్లో మిగిలిన అన్ని పార్టీల కంటే బీజేపీ మెరుగైన హామీగా డీఎండీకే భావిస్తోంది.
 
  ఏ పార్టీకి మద్దతు పలకాలో తెలియని అయోమయంలో కెప్టెన్ పడిపోయారు. వచ్చే నెల 2వ తేదీన ఉళుందూర్‌పేటలో జరిగే పార్టీ సమావేశంలో పొత్తుపై నిర్ణయం తీసుకుంటారని డీఎండీకే శ్రేణులు ఆశిస్తుండగా, ఆ నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్, బీజేపీ, డీఎంకే ఆశపడుతున్నాయి. ఇదిలా ఉండగా వచ్చేనెల జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి ఓటు వేయబోమని పీఎంకే అధినేత రాందాస్ ప్రకటించారు. అసెంబ్లీలో ఈ పార్టీకి మూడు ఓట్లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement