ఏసీబీకి చిక్కిన వీఆర్వో | acb caught vro in prakasam district | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

Nov 28 2016 2:58 PM | Updated on Aug 17 2018 12:56 PM

లంచం తీసుకుంటూ ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం నాగిళ్లముడుపు వీఆర్వో నంచర్ల వెంకట శివకాశయ్య ఏసీబీకి దొరికిపోయాడు.

తర్లుపాడు: లంచం తీసుకుంటూ ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం నాగిళ్లముడుపు వీఆర్వో నంచర్ల వెంకట శివకాశయ్య ఏసీబీకి దొరికిపోయాడు. దూళ్ల వెంకటేశ్వర్లు అనే రైతు ఇ-పాస్‌బుక్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, దానిని మంజూరు చేయకుండా నెల రోజులుగా తిప్పుకుంటున్నాడు. రూ. 10వేలు ఇస్తేనే పని అవుతుందని మెలిక పెట్టాడు. రైతు ప్రాధేయపడగా చివరికి రూ. 7వేలకు అంగీకరించాడు. దీనిపై బాధిత రైతు ఏసీబీకి సమాచారం అందించారు. వారిచ్చిన సూచనల మేరకు సోమవారం మధ్యాహ్నం  రైతు వీఆర్‌వోకు డబ్బును ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు అతడిని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement