ఈతకు వెళ్లి ముగ్గురు మృత్యువాత | 3 -dead-while-goes-to-the -bath-swimming-in-pond | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి ముగ్గురు మృత్యువాత

Apr 1 2017 3:47 PM | Updated on Oct 20 2018 6:19 PM

ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు.

సూళ్లూరుపేట: ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు. సూళ్లూరుపేట మండలం దామానెల్లూరు పంచాయతీ డేగావారికండ్రిగలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలివీ.. రైల్వే కోడూరుకు చెందిన పావని(11) డేగావారికండ్రిగ గ్రామ గిరిజనవాడలో ఉండే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. శనివారం మధ్యాహ్నం తన మేనమామ కొడుకు మణి(8), కూతురు శ్యామల(10)లను వెంటబెట్టుకుని సమీపంలోని కుంట వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లింది.
 
లోతు తెలియక నీటిలోకి దిగిన ముగ్గురూ అందులో మునిగిపోయారు. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవటంతో వారినెవరూ గమనించలేదు. కొద్ది సేపటి తర్వాత వారిని వెదుక్కుంటూ అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులకు దుస్తులు, చెప్పులను గుర్తుపట్టి కుంటలో గాలించగా మృతదేహాలు లభ్యమయ్యాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement