అంపైర్‌గా ఇదే చివరిది.. | Umpire Ian Gould To Retire After India vs Sri Lanka Match | Sakshi
Sakshi News home page

అంపైర్‌గా ఇదే చివరిది..

Jul 6 2019 8:25 PM | Updated on Jul 6 2019 8:30 PM

Umpire Ian Gould To Retire After India vs Sri Lanka Match - Sakshi

లీడ్స్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌ తర్వాత ఇంగ్లిష్‌ అంపైర్‌ ఇయాన్‌ గౌల్డ్‌ తన 13 ఏళ్ల అంపైరింగ్‌ కెరీర్‌ నుంచి వీడ్కోలు తీసుకోబోతున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘ అంపైర్‌గా ఇయాన్‌ గౌల్డ్‌ కు భారత్‌-శ్రీలంక మ్యాచే చివరిది’ అని తన సందేశంలో పేర్కొంది.

2006లో సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌-శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో అంపైర్‌గా అరంగేట్రం చేసిన గౌల్డ్‌‌... నాలుగు వరల్డ్‌కప్‌ల్లో అంపైర్‌గా వ్యవహరించారు. 2007, 2011, 2015, 2019 వరల్డ్‌కప్‌లో అంపైర్‌గా వ్యవహరించారు. 2011 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు సైతం  ఇయాన్‌ గౌల్డ్‌ అంపైర్‌గా సేవలందించారు. ఆ మ్యాచ్‌ గౌల్డ్‌ అంపైరింగ్‌ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక ఆటగాడిగా ఇంగ్లండ్‌ తరఫున గౌల్డ్‌ 18 అంతర్జాతీయ వన్డేలు ఆడారు. 1983 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆటగాడిగా ఆయనకు చివరిది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement