రెచ్చిపోయిన రైనా | suresh raina hits fifty | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన రైనా

Feb 1 2017 8:09 PM | Updated on Sep 5 2017 2:39 AM

రెచ్చిపోయిన రైనా

రెచ్చిపోయిన రైనా

ఇంగ్లండ్తో చివరి టి-20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్మన్ రైనా(45 బంతుల్లో 63) రెచ్చిపోయాడు.

బెంగళూరు: ఇంగ్లండ్తో చివరి, మూడో టి-20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్మన్ సురేష్ రైనా (45 బంతుల్లో 63) రెచ్చిపోయాడు. రైనా 39 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. బుధవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన విరాట్ కోహ్లీ సేన 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. రైనా అవుటయ్యాక యువరాజ్ బ్యాటింగ్కు దిగాడు. ధోనీ (25) క్రీజులో ఉన్నాడు.  

ఓపెనర్గా బరిలోకి దిగిన కోహ్లీ 2 పరుగులకే అవుటయినా రైనా ఆదుకున్నాడు. మరో ఓపెనర్ రాహుల్‌ (22)తో కలసి రైనా రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. కోహ్లీ రనౌటవగా, రాహుల్.. స్టోక్స్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. రైనా.. ప్లంకెట్ ఓవర్లో క్యాచవుటయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement