ఐపీఎల్ సహాయక సిబ్బందిలో తొలి మహిళ
బెంగళూరు: ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ సహాయక సిబ్బందిలో ఒక మహిళను తీసుకుంది. టీమ్ మసాజ్ థెరపిస్ట్గా నవనీత గౌతమ్ ఎంపికైంది. ఐపీఎల్లో ఏ జట్టులోనైనా సహాయక సిబ్బందిలో ఒక మహిళ ఉండటం ఇదే మొదటిసారి.
ఆర్సీబీ హెడ్ ఫిజియోథెరపిస్ట్ ఇవాన్ స్పీచ్లీ, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ శంకర్ బసులతో కలిసి నవనీత పని చేస్తుంది. మసాజ్ థెరపీలో ప్రత్యేక శిక్షణ ఉన్న ప్రతిభావంతురాలు నవనీతను తమ జట్టులోకి ఎంచుకోవడం పట్ల గర్వపడుతున్నామని బెంగళూరు చైర్మన్ సంజీవ్ చురీవాలా వ్యాఖ్యానించారు.
మరిన్ని వార్తలు