రాణించిన నితీష్ రానా | mumbai indians set target of 173 runs for gujarat lions | Sakshi
Sakshi News home page

రాణించిన నితీష్ రానా

May 21 2016 9:41 PM | Updated on Aug 21 2018 2:28 PM

రాణించిన నితీష్ రానా - Sakshi

రాణించిన నితీష్ రానా

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం గ్రీన్ పార్క్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

కాన్పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం గ్రీన్ పార్క్ స్టేడియంలో  గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో  ముంబై ఇండియన్స్  173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఆదిలో తడబడినా,  నితీష్ రానా(70;36 బంతుల్లో 7 ఫోర్లు,4 సిక్సర్లు) ఆదుకున్నాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ(30;17 బంతుల్లో4 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి నిష్ర్కమించాడు. అనంతరం మరో ఓపెనర్ మార్టిన్ గప్తిల్(7), కృనాల్ పాండ్య(4) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో ముంబై 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో రానా-బట్లర్ ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఓ వైపు రానా ధాటిగా ఆడుతుంటే, బట్లర్(33;31 బంతుల్లో 3 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. ఈ జోడి 75 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో ముంబై తేరుకుంది. ఆ తరువాత పొలార్డ్(9), హర్దిక్ పాండ్యా(8), హర్భజన్ సింగ్(3)లు నిరాశపరచడంతో  ముంబై నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి172 పరుగులు నమోదు చేసింది. గుజరాత్ బౌలర్లలో డ్వేన్ స్మిత్, ప్రవీణ్ కుమార్, ధావల్ కులకర్ణి, డ్వేన్ బ్రేవోలు తలో రెండు వికెట్లు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement