ఈనెల 18న జైపూర్‌లో ఐపీఎల్‌–2019 వేలం  | IPL-2019 auction in Jaipur on 18th of this month | Sakshi
Sakshi News home page

ఈనెల 18న జైపూర్‌లో ఐపీఎల్‌–2019 వేలం 

Dec 4 2018 12:50 AM | Updated on Dec 4 2018 12:50 AM

IPL-2019 auction in Jaipur on 18th of this month - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)– 2019 కోసం ఆటగాళ్ల వేలం ఈ నెల 18న జైపూర్‌లో జరుగుతుంది. ఒకే రోజుతో ముగిసిపోయే ఈ వేలంలో గరిష్టంగా 70 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులో 50 మంది భారత క్రికెటర్లు కాగా 20 మంది విదేశీయులు. ఇందు కోసం అన్ని ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 145.25 కోట్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ జట్లు ఇప్పటికే విడుదల చేసిన ప్రముఖ క్రికెటర్లలో యువరాజ్‌ సింగ్, గంభీర్, ముస్తఫిజుర్, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ తదితరులు ఉన్నారు. వీరంతా వేలంలోకి వస్తారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement