ఈనెల 18న జైపూర్‌లో ఐపీఎల్‌–2019 వేలం 

IPL-2019 auction in Jaipur on 18th of this month - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)– 2019 కోసం ఆటగాళ్ల వేలం ఈ నెల 18న జైపూర్‌లో జరుగుతుంది. ఒకే రోజుతో ముగిసిపోయే ఈ వేలంలో గరిష్టంగా 70 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులో 50 మంది భారత క్రికెటర్లు కాగా 20 మంది విదేశీయులు. ఇందు కోసం అన్ని ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 145.25 కోట్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ జట్లు ఇప్పటికే విడుదల చేసిన ప్రముఖ క్రికెటర్లలో యువరాజ్‌ సింగ్, గంభీర్, ముస్తఫిజుర్, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ తదితరులు ఉన్నారు. వీరంతా వేలంలోకి వస్తారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top