'ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు' | Imran Khan Criticises PCB, Says PSL Final Should Not be Held in Lahore | Sakshi
Sakshi News home page

'ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు'

Feb 28 2017 4:26 PM | Updated on Sep 5 2017 4:51 AM

'ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు'

'ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు'

పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ఫైనల్ పోరును లాహోర్లో నిర్వహించాలనుకుంటున్న ఆ దేశ క్రికెట్ బోర్డుపై దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డాడు.

లాహోర్: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ఫైనల్  పోరును లాహోర్లో నిర్వహించాలనుకుంటున్న ఆ దేశ క్రికెట్ బోర్డుపై దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డాడు. ఇటీవల కాలంలో వెంటవెంటనే రెండు ఉగ్రదాడులు జరిగిన ఆ ప్రాంతంలో పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించాలనుకోవడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించాడు. ఆ నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తక్షణమే విరమించుకోవాలన్నాడు. కానిపక్షంలో పీసీబీకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విమర్శించాడు. 'అసలు ఏ సందేశాన్ని పీసీబీ ప్రజలకు ఇవ్వాలనుకుంటుంది.

 

'గత కొన్నిరోజులు క్రితం వరుసగా రెండుసార్లు ఉగ్రదాడులు జరిగాయి. ఈ పరిస్థితుల్లో లాహోర్లో ఫైనల్ మ్యాచ్  నిర్వహించాలనుకోవడం అనాలోచిత నిర్ణయం'అని ఇమ్రాన్ తెలిపాడు. మరొకవైపు మాజీ క్రికెటర్ ఆరిఫ్ అలీ ఖాన్ అబ్బాసీ కూడా పీసీబీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ప్రమాదంతో కూడుకున్న ప్రదేశాల్లో క్రికెట్ మ్యాచ్ ఫైనల్ నిర్వహించాలనుకోవడం మంచి నిర్ణయం కాదన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement