ఆస్ట్రేలియాపై రెండో టెస్టులో విజయంతో భారత జట్టు తమ నంబర్వన్ స్థానాన్ని మరింత పటిష్ట పర్చుకుంది.
దుబాయ్: ఆస్ట్రేలియాపై రెండో టెస్టులో విజయంతో భారత జట్టు తమ నంబర్వన్ స్థానాన్ని మరింత పటిష్ట పర్చుకుంది. మిగిలిన రెండు టెస్టుల్లో ఫలితం ఎలా ఉన్నా... కటాఫ్ తేదీ అయిన ఏప్రిల్ 1 వరకు భారత ర్యాంకులో మార్పుండదు. అగ్రస్థానంలో నిలిచే భారత్కు గదతో పాటు మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6 కోట్ల 67 లక్షలు) నగదు బహుమతి కూడా లభిస్తుందని ఐసీసీ ప్రకటించింది.