ఆర్టీసీ బస్సు ప్రమాదం: 50 మందికి గాయాలు | 50 passengers injured in rtc bus accident at sangareddy | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ప్రమాదం: 50 మందికి గాయాలు

Feb 10 2018 4:31 PM | Updated on Apr 7 2019 3:24 PM

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పుల్కల్‌ మండలం శివంపేట శివారులో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 50 మందికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి నారాయణఖేడ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement