191వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర షెడ్యూల్‌

YS Jagan Prajasankalpayatra 191Th Day Schedule Released - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 191వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌ పాదయాత్రను వెదిరేశ్వరం ఎంపీపీ స్కూల్‌ నుంచి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వెదిరేశ్వరం, కేతరాజుపల్లి, దేవరపల్లి, ఈతకోట చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. పలివెలక్రాస్‌, గంటిపల్లిపాలెం క్రాస్‌ మీదుగా గంటి వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. జననేతకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top