కనీస ఉమ్మడి ప్రణాళికపై కసరత్తు | Work on minimum joint plan | Sakshi
Sakshi News home page

కనీస ఉమ్మడి ప్రణాళికపై కసరత్తు

Nov 13 2018 1:26 AM | Updated on Mar 18 2019 9:02 PM

Work on minimum joint plan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వస్తున్న సమయంలో కూటమి నేతలు కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)పై తుది కసరత్తు ప్రారం భించారు. సోమవారం కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క నివాసంలో కూటమి నేతలు భేటీ అయ్యారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీజేఎస్‌ అధినేత కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్‌లు భట్టి ఆహ్వానం మేరకు అల్పాహార విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి పక్షాన ప్రజల ముందుంచాల్సిన సీఎంపీపై చర్చించారు. ‘పీపుల్స్‌ ఎజెండా’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. సీఎంపీకి సంబంధించిన తుది ప్రతిపాదనలను టీడీపీ, టీజేఎస్‌ నేతలు భట్టికి అందజేశారు. దీనిపై భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకత్వం, కూటమి నాయకుల సమక్షంలో చర్చించి ఎజెండాను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement