మోదీ, షా అభినందనలు

PM Modi congratulates Devendra Fadnavis, Ajit Pawar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా శనివారం ఉదయం ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌లకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. వీరిద్దరి నాయకత్వంలో మహారాష్ట్ర మరింత అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హెంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌లను అభినందించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ధికి, మరాఠి ప్రజల సంక్షేమానికి పాటు పడుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. (చదవండి: ‘మహా’ మలుపు.. రాత్రికి రాత్రి ఏం జరిగింది?)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top