పోటాపోటీగా నేతల పూజలు.. | Party Leaderss Offers Prayers At Temples And Muths | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు ముందు నేతల పూజలు

May 15 2018 8:30 AM | Updated on Mar 22 2019 6:18 PM

Party Leaderss Offers Prayers At Temples And Muths - Sakshi

సాక్షి,బెంగళూర్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు ప్రధాన పార్టీల నేతలు పూజలు నిర్వహించారు. షికారిపుర నుంచి పోటీలో నిలిచిన బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప మంగళవారం ఉదయం పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ పూజలు చేశారు. ఇక బాదామి నియోజకవర్గంలో సీఎం సిద్ధరామయ్యపై పోటీ చేసిన బీజేపీ నేత బి శ్రీరాములు పార్టీ విజయాన్ని కోరుతూ మంగళవారం ఉదయాన్నే ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు జేడీఎస్‌ చీఫ్‌ హెచ్‌డీ కుమారస్వామి పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ నగమగాలలోని ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠంలో పూజలు నిర్వహించారు.

కుమారస్వామి రామనగర, చెన్నపట్న నియోజకవర్గాల్లో బరిలో నిలిచారు. కాగా కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వెలుపల కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాజా ట్రెండ్స్‌ ప్రకారం బీజేపీపై కాంగ్రెస్‌ స్వల్ప ఆధిక్యత కనబరుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement