‘అసాధ్యాన్ని కేసీఆర్‌ సుసాధ్యం చేశారు’ | electricity employees join trvks | Sakshi
Sakshi News home page

Jan 7 2018 8:35 PM | Updated on Aug 15 2018 9:45 PM

electricity employees join trvks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్‌ 24 గంటల విద్యుత్‌ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ విద్యుత్‌శాఖ ఉద్యోగులు ఆదివారం టీఆర్‌వీకేఎస్‌లో చేరారు. 24 గంటల కరెంటు ఇవ్వడం ద్వారా సీఎం కేసీఆర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని విద్యుత్‌ ఉద్యోగులు అన్నారు.  టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్‌వీకేఎస్‌)లో విద్యుత్‌ ఉద్యోగులు చేరడాన్ని ఆ పార్టీ ఎంపీ కవిత స్వాగతించారు. విద్యుత్‌ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement