‘వైఎస్‌ జగన్‌ నిర్ణయంలో విశ్వసనీయత ఉంది’

' credibility in YS Jagan's decision ' - Sakshi

తూర్పుగోదావరి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయంలో విలువలు, విశ్వసనీయత ఉందని కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కురుసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తన ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్ జగన్ చేసిన ప్రకటన చారిత్రాత్మకమన్నారు. 

ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి ఉద్యమిస్తున్న నాయకుడు వైఎస్ జగనేనని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో చట్టం చేసిన ప్రత్యేక హోదా కాదని.... ప్యాకేజీ కి ఒప్పుకునే అధికారం చంద్రబాబుకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పార్లమెంటు ముందు టీడీపీ ఎంపీలు బుడబుక్కల వేషాలు వేస్తూ ఆంధ్రుల పరువు తీస్తున్నారని విమర్శించారు.  హోదాపై చంద్రబాబు వైఖరి ఏమీటో ఇప్పటికైన స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top