'మోడ్రన్ అంటూ మోసం చేస్తున్నారు' | ysrcp support to ap special status dharna at janthar manthar | Sakshi
Sakshi News home page

'మోడ్రన్ అంటూ మోసం చేస్తున్నారు'

Dec 7 2015 3:29 PM | Updated on Mar 23 2019 9:10 PM

'మోడ్రన్ అంటూ మోసం చేస్తున్నారు' - Sakshi

'మోడ్రన్ అంటూ మోసం చేస్తున్నారు'

విభజనతో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్రం మాట నిలబెట్టుకోవాలని గతంలో కేంద్రం చేసిన వాగ్దానం గుర్తుచేశారు.

న్యూఢిల్లీ: విభజనతో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్రం మాట నిలబెట్టుకోవాలని గతంలో కేంద్రం చేసిన వాగ్దానం గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి సోమవారం ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవులను కాపాడుకునేందుకే టీడీపీ నేతలు నోరు విప్పడం లేదని చెప్పారు. మోడ్రన్ కేటగిరి అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్ నేతల మద్దతు కూడా..
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్, కేవీపీ, సుబ్బరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జైరాం మాట్లాడుతూ ఆనాడు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగిన వెంకయ్యనాయుడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement