పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ సీపీ ఎంపీల ధర్నా | YSRCP MPs stage dharna at Parliament for special status | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ సీపీ ఎంపీల ధర్నా

Aug 2 2016 10:47 AM | Updated on Mar 23 2019 9:10 PM

పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ సీపీ ఎంపీల ధర్నా - Sakshi

పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ సీపీ ఎంపీల ధర్నా

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవాలన్న డిమాండ్ తో వైఎస్సార్ సీపీ ఎంపీలు వరుసగా రెండో రోజూ పార్లమెంట్ లో ఆందోళన కొనసాగించారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవాలన్న డిమాండ్ తో వైఎస్సార్ సీపీ ఎంపీలు వరుసగా రెండో రోజూ పార్లమెంట్ లో ఆందోళన కొనసాగించారు. లోక్సభలో నిన్న తమ గళం బలంగా వినిపించిన వైఎస్సార్ సీపీ సభ్యులు మంగళవారం పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట  ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రత్యేక హోదా ఇవాల్సిందేనని గట్టిగా నినదించారు.

మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక, విజయసాయిరెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎంపీ చెప్పారు. మరోవైపు ప్రత్యేక హోదా కోసం లోక్ సభలో వైఎస్ఆర్ సీపీ వరుసగా రెండో రోజూ వాయిదా తీర్మానం ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement