సోనియా, మన్మోహన్‌లతో వెంకయ్య మంతనాలు | Venkaiah Naidu Met Sonia, Manmohan Singh over GST issue | Sakshi
Sakshi News home page

సోనియా, మన్మోహన్‌లతో వెంకయ్య మంతనాలు

Jan 7 2016 11:48 AM | Updated on Oct 22 2018 9:16 PM

సోనియా, మన్మోహన్‌లతో వెంకయ్య మంతనాలు - Sakshi

సోనియా, మన్మోహన్‌లతో వెంకయ్య మంతనాలు

కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందేందుకు సహకరించాలని వారిని వెంకయ్య కోరారు.

జీఎస్టీపై కాంగ్రెస్‌ పార్టీ మూడు అంశాలను లేవనెత్తిందని, వీటిని ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పరిష్కరించారని వెంకయ్య తెలిపారు. ఈ విషయమై పార్టీలో అంతర్గతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సోనియా, ప్రధాని తనకు తెలిపారని ఆయన చెప్పారు. అవసరమైతే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ముందస్తుగా నిర్వహించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement