వెంకయ్యతో సుజనా, సీఎం రమేష్ భేటీ | TDP MPs minister sujana chowdary, cm ramesh meets venkaiah naidu | Sakshi
Sakshi News home page

సాయంత్రానికి క్లారిటీ వస్తుంది: సుజనా

Sep 7 2016 11:36 AM | Updated on Mar 23 2019 9:10 PM

వెంకయ్యతో సుజనా, సీఎం రమేష్ భేటీ - Sakshi

వెంకయ్యతో సుజనా, సీఎం రమేష్ భేటీ

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ బుధవారం భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ బుధవారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలపై వెంకయ్య నాయుడుతో చర్చించినట్లు తెలిపారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెబుతోందని, సాయంత్రానికి ఓ స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. చట్టపరంగా ఉన్న అంశాలపై చర్చ జరుగుతోందన్నారు. వెంకయ్యతో భేటీ అనంతరం సుజనా చౌదరి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు.

కాగా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలు, రాష్ట్ర విభజన నాడు ఇచ్చిన వాగ్దానాల సంకలనంగా కేంద్రం రూపొందించిన ఆర్థిక ప్యాకేజీపై నేడు ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. బుధవారం మధ్యాహ్నం అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు కలిసి సంబంధిత ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement