ఇండిపెండెన్స్‌ డే: పాకిస్తాన్‌కు సుష్మా కానుక | Sushma announces gift to pakistan on India Independence day | Sakshi
Sakshi News home page

ఇండిపెండెన్స్‌ డే: పాకిస్తాన్‌కు సుష్మా కానుక

Aug 16 2017 6:30 PM | Updated on Oct 9 2018 7:52 PM

ఇండిపెండెన్స్‌ డే: పాకిస్తాన్‌కు సుష్మా కానుక - Sakshi

ఇండిపెండెన్స్‌ డే: పాకిస్తాన్‌కు సుష్మా కానుక

భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ పాకిస్తాన్‌ పౌరులకు ప్రత్యేక కానుక ప్రకటించారు.

న్యూఢిల్లీ: భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ పాకిస్తాన్‌ పౌరులకు ప్రత్యేక కానుక ప్రకటించారు. వైద్యం కోసం భారత వీసాకు దరఖాస్తు పెట్టుకున్న వారందరికీ మెడికల్‌ వీసాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె ఓ ప్రకటన చేశారు.

వీలైనంత త్వరగా పెండింగ్‌లో ఉన్న మెడికల్‌ వీసాలను క్లియర్‌ చేయనున్నట్లు ఆమె ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న ఈ శుభ తరుణాన.. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మెడికల్‌ వీసాలన్నింటినీ అనుమతిస్తున్నాం’ అని సుష్మా చేసిన ట్వీట్‌ సారాంశం. ప్రతి నెలా సుమారు 500 మంది పాకిస్థానీ పేషెంట్లు వైద్య చికిత్స కోసం భారత్‌కు వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement