జమ్మూకశ్మీర్‌, జార్ఖండ్లలో పోలింగ్ ప్రారంభం | Polling begins in Jharkhand and Jammu Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌, జార్ఖండ్లలో పోలింగ్ ప్రారంభం

Nov 25 2014 7:59 AM | Updated on Aug 14 2018 4:39 PM

జమ్మూకశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది.

శ్రీనగర్/రాంచీ/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్‌లో 15 స్థానాలకు, జార్ఖండ్‌లో 13 స్థానాలకు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జమ్మూకశ్మీర్‌లో 15 స్థానాలకుగానూ 123మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  జార్ఖండ్లో 13 స్థానాలకుగానూ 199మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

కాగా జార్ఖండ్లో 33.65 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే జమ్మూ కశ్మీర్లోనూ 10.50 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement