నాసా ఫోటోలు.. కేంద్ర మంత్రిపై జోకులు
న్యూఢిల్లీ : బీజేపీ నేతలు వరుసగా వివాదాలు, విచిత్ర ప్రకటనలతో వార్తల్లో నిలుస్తూ అభాసుపాలవుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఓ ట్వీట్ చేసి ఆ జాబితాలో చేరిపోయారు. నాసా ఫోటోలను పోస్ట్ చేసి.. ‘మోదీ అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతోంది’ అంటూ ఆయన ఓ సందేశం ఉంచారు. అయితే ఆయన పోస్ట్ చేసిన ఫోటోలు చాలా పాతవి కావడంతో కొందరు ఆయన్ని ఏకీపడేస్తున్నారు.
‘ దేశంలో అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా అందించినందుకు ధన్యవాదాలు . కానీ ఫోటోలు షేర్ చేసే ముందు మీ సోషల్ మీడియా విభాగానికి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోమని చెప్తే బాగుండేది. అది నాసా 2017లో విడుదల చేసిన ఫోటోలు సర్’ అంటూ ఓ వ్యక్తి రీట్వీట్ చేశారు. ‘ ఆ శాటిలైట్ ఫోటోలను ఎక్కడి నుంచి తీసుకున్నారు చెప్పలేదు. దయచేసి దీని కంటే బలమైన సాక్ష్యాలని చూపించండి’ అంటూ మరో వ్యక్తి రిప్లై ఇచ్చారు. ప్రతీ దీపావళి పండగ మరుసటి రోజు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటుంది. అలాంటి ఫోటోలనే పీయూష్ ట్వీట్ చేయటంతో ఆయనపై జోకులు పేలుస్తున్నారు.
కాగా, మణిపూర్లోని సేనాపతి జిల్లా లాయ్సాంగ్ గ్రామానికి శనివారం కరెంటు సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. దేశంలో అన్ని గ్రామాలను విద్యుదీకరించామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పీయూష్ ట్వీట్ చేయగా.. అది కాస్త వికటించింది.
Under the decisive leadership of PM @NarendraModi India has finally been able to electrify all its villages before the set target date. With the elimination of darkness from the lives of fellow Indian villagers, we commit ourselves to building a new and #PowerfulIndia pic.twitter.com/TJ8irmx4tk
— Piyush Goyal (@PiyushGoyal) 29 April 2018
#Hoax
Piyush Goyal sir the pictures you posted are old..
Pic1- Released by NASA in 2012
Pic2- Released by NASA in 2016 pic.twitter.com/O92eB8SKto— Amit Shah (@amitshaah_) 29 April 2018
This is the same fake image that is shared after every Diwali. 😂😂
Entire BJP govt relies heavily on Photoshop and fake news. How about doing some real work.😒https://t.co/LcDfUlM4uf
— Keerthi🌹 (@TheDesiEdge) 29 April 2018